మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 21

సృష్టిలో మనుషులతో పాటు నోరులేని జీవాలకు కూడా ఆకలి అనేది సహజం… మనుషుల చుట్టూ ఉన్న జంతువులకైతే ఎలాగలో తినడానికి ఆహారం అందుతుంది,కానీ అడవుల్లో ఉన్న వానరులకు ఆహారం దొరకక పల్లెలు పట్టణాల వైపు వచ్చి ప్రాణాలు కోల్పోతున్న వానరులకు ఏదైనా చేయాలని ఆలోచనతో ఐదు సంవత్సరాల క్రితం సేవ్ మంకీస్ ఫీడ్ మంకీస్ అనే నినాదంతో మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు,ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వాట్స్అప్ గ్రూపు సభ్యుల సహకారంతో ప్రతి నెల ఒక రోజు అందుబాటులో ఉన్న సభ్యులతో కలిసి మల్కాజ్గిరి నుండి నర్సాపూర్ అడవికి వెళ్లి వానరులకు ఆహారం అందివ్వడం జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా మంగళవారం గ్రూప్ సభ్యులు అహ్మద్ అలీ ఖాన్, ఫణి కుమార్, శ్రీనివాస్ చారి,అయ్యంగార్ బేకరీ చిన్నస్వామి గార్ల సహకారంతో అరటి పండ్లు బ్రెడ్ ఆహారంగా అందివ్వడం జరిగింది.ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ ఈ మార్చి నెలతో వానరులకు ఆహార అందించే కార్యక్రమం చేపట్టి సరిగ్గా ఐదు సంవత్సరాలు పూర్తయిందని అన్నారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి గత ఐదు సంవత్సరాల నుంచి సహకరిస్తున్న గ్రూప్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు, శ్రీనివాస్ చారి, బాలరాజు పాల్గొన్నారు.





