
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి . శ్రీనివాస్, ఆళ్లపల్లి, మార్చి 16.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఆళ్లపల్లి మండల కేంద్రంలో రేగా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన రేగా కప్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ముఖ్య అతిథులుగా హాజరై క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు వారి చేతుల మీదుగా నగదు తో పాటు బహుమతులు ప్రధానం చేయడం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడలలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని అన్నారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు, గెలిచినప్పుడు పొంగిపోకుండా ఓడినప్పుడు కుంగిపోకుండా యువత ప్రతిదానిని స్వీకరించి తమ తమ రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని యువత పెడదారి పడకుండా క్రీడలలో పాల్గొనడం వలన శరీరం దృఢంగా ,శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు . క్రీడలు ఎప్పుడు గ్రామంలో జరిగిన నా ప్రోత్సాహం ఉంటుంది అన్నారు.క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.





