
*ముఖ్య అతిధిగా ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక, మార్చి 10.
పినపాక మండలం లోని బయ్యారం క్రాస్ రోడ్ నందు గల ఎక్సలెంట్ బాషా హై స్కూల్ నందు ఏర్పాటు చేసిన ఫెరెవెల్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు హాజరయ్యారు.తొలిత తొమ్మిది వ తరగతి, పదవ తరగతి విద్యార్థులు పాఠశాల యాజమాన్యం వారికి ఘన స్వాగతం పలికారు.ఈ సందర్బంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మీకు పరీక్షల సమయం చాలా దగ్గరలో ఉన్నాయని,పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులు చాలా కష్టపడి చదవాల్సిన అవసరం ఉందని అన్నారు.విద్య వ్యవస్థలో అందుబాటులో ఉన్న వనరుల ను సద్వినియోగం చేసుకోని విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అన్నారు. విద్యార్థులు విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ఉన్నత శిఖరాలను అందుకోవడానికి అర్హత సాధిస్తారని ఆయన తెలిపారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువులో బాగా రాణించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని అన్నారు. చిన్నారులు కన్నుల విందు గా నృత్యాలు, ఆట పాటలతో తమ ప్రతిభను చూపించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సీఐ రాజగోపాల్, ఎస్ ఐ నాగుల్ మీరా, ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ ఎండి యూసఫ్ షరీఫ్, ఎక్సెలెంట్ గ్రూప్ అఫ్ స్కూల్స్ కరస్పాండెంట్ ఎండీ ఖాదర్, డైరెక్టర్స్ ఎండీ ఎండీ యాకుబ్ షరీఫ్, ఎండీ ఖాన్, ముక్కు నర్సారెడ్డి, బండారు నరేంద్ర, ప్రిన్సిపాల్ అంకం సురేష్ , సినీయర్ ఉపాధ్యాయురాలు వాల్సలా మోహన్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.





