
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, మార్చి 10.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో గల పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జురుగుతున్న అభివృద్దిని చూసి ప్రజలు బి.ఆర్. ఎస్ పార్టీని ఆదరించడం ఓర్వలేకనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ సీబీఐని, ఈడీని ఉపయోగించి బెదెరెంపులకు పాల్పడుతుందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పేద ప్రజలకు న్యాయం జరిగేలా అనేక సంక్షేమ పధకాలు అమలు పరుస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న బెదిరింపు దోరణి మానుకోవాలని పేద ప్రజలకు న్యాయం చేసేలా తెలంగాణ ప్రభుత్వానికి అడ్డుపడకుండా ఉండాలన్నారు.ఈ సమావేశంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ,వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి,ఆత్మ చైర్మన్ పొనుగోటి భధ్రయ్య, సీనియర్ నాయకులు కోలేటి భవానీ శంకర్, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, మదార్సాహెబ్, సర్పంచ్ గొగ్గలి నాగేశ్వరరావు, గొంది నాగభూషణం, వెంకటనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.





