
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, మార్చి 8 :
నేరస్తుని వివరములు:-
- జక్కా రాంబాబు సన్నాఫ్ నర్సింహారావు, వయస్సు 35 సంవత్సరాలు, కులం యాదవ్, వృత్తి వ్యవసాయం, నివాసం కిష్టాపురం గ్రామం, మిర్యాలగూడ మండలం.
కేసు వివరములు:
మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామంకు చెందిన ఒక మహిళను 7 వ తేదీ నాడు రాత్రి తన గ్రామంలో తన ఇంటికి వెళ్ళుచుండగా అదే గ్రామానికి చెందిన జక్కా రాంబాబు అను వ్యక్తి లైంగిక వేధింపులు చేయుచుండగా, అట్టి వ్యక్తిని మహిళకి సంబందిచిన వారు చూసి పట్టుకోబోగా పారిపోయినాడు. వారందరూ కలిసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళుచుండగా , అట్టి వ్యక్తి పై వారు కేసు పెడతారని భావించి తన ఇంటిలోని ఇనుప కత్తి తీసుకొని వచ్చి వారందరినీ భయభ్రాంతులకు గురిచేసినాడు. బాధితురాలు మార్చి 8వ తేదీ బుధవారం రోజున ఉదయం పోలీస్ అధికారులకు ఇచ్చిన దరఖాస్తు పై పలు సెక్షన్ల ప్రకారం మరియు ఆర్మ్స్ ఆక్ట్ కేసు నమోదు చేసి మిర్యాలగూడ రూరల్ పోలీస్ అధికారులు దర్యాప్తు చేసి తగు సాక్షాధారాలు సేకరించి, అట్టి వ్యక్తిని రిమాండ్ కు తరలించనైనది.
ఈ సందర్భంగా యస్.పి కె. అపూర్వరావు మాట్లాడుతూ.. ఎవరైన ఆకతాయిలు మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని,జిల్లాలో షి టీమ్ బృందాలు... అన్ని ప్రాంతాలలో నిఘా పెడుతూ న్నాయాని అన్నారు. ఎవరినైన మహిళలను, విద్యార్థినిలను వేధింపులకు గురి చేస్తే దైర్యంగా డయల్ 100 గాని మీకు దగ్గరలో సంబంధిత పోలీస్ స్టేషన్ కి గాని తెలియపరచగలరని మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎస్పీ కె.అపూర్వరావు తెలపడం జరిగింది.
నేరస్తుల నుండి స్వాదీన పరచుకున్న వస్తువులు…
నేరస్తుడి నుండి ఒక పొడవైన ఇనుప కత్తి.
ఇట్టి కేసును మిర్యాలగూడ డీఎస్పీ పి. వెంకటగిరి పర్యవేక్షణలో ప్రతిష్టాత్మకముగా తీసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ ఎం.సత్యనారాయణ సి.ఐ. ఆఫ్ పోలీస్ మిర్యాలగూడ రూరల్ నేతృత్వంలో మిర్యాలగూడ సబ్ ఇన్స్పెక్టర్ నర్సింహులు, రూరల్ పోలీస్ అధికారుల బృందంతో అట్టి నేరస్తుడిని అతి తక్కువ సమయంలో పట్టుకొని కేసు ఛేదించినందుకు మిర్యాలగూడ రూరల్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ కె. అపూర్వరావు అభినందనలు తెలియజేశారు.





