
*మార్చ్ 8న విధులకు హాజరవ్వాలని ఆదేశాలు.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, మణుగూరు ,మార్చి 8.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చ్ 8 వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని శాఖలకు స్పెషల్ కాజువల్ లీవ్ మంజూరు చేసింది. ఇది ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చిన గౌరవం. కానీ ఇప్పపటికి ఈరోజు లీవ్ తీసుకోవడానికి మహిళా ఉద్యోగులు ఒకరోజు ముందుగా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు కొంతమంది జిల్లా అధికారులు. అదిమాత్రమే కాకుండా ఉద్యోగులు ఉన్న వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్ కూడా పెట్టి మహిళా ఉద్యోగులను అవమానిస్తున్నారు. ఫోన్ చేసి మరీ నా పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని బెదిరిస్తూ మహిళా ఉద్యోగులను వేదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలపై గౌరవంతో ప్రకటించిన సెలవును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో కొంతమంది ఉన్నతాధికారులు నిరర్థకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మహిళా ఉద్యోగులపై తమ ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి పూనుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే పాల్వంచ భవిత కేంద్రంలో ఐఈఆర్పి గా విధులు నిర్వహిస్తున్న కనకదుర్గ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పాల్వంచ వర్తక సంఘం భవనంలో ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్- తెలంగాణ రాష్ట్రం, పాల్వంచ మండల శాఖ ఆధ్వర్యంలో మండల మహిళా విభాగం వారు నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు సిద్దమవుతుంది. ఇదే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఈ కో ఆర్డినేటర్ సైదులు ఫోన్ చేసి భవిత కేంద్రంలో విధులకు ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలకు హాజరగుతున్నాని ఈరోజు రాష్టం ప్రభుత్వ సెలవు ప్రకటించింది అని వివరించినా పట్టించుకోకుండా ఒకరోజు ముందుగా నావద్ద అనుమతి ఎందుకు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తాళం వేసున్న పాల్వంచ భవిత కేంద్రం ఫోటోలు తీసి ఐఈఆర్పీ లు ఉన్న గ్రూపులో పోస్ట్ చేసి భవిత కేంద్రం ఎందుకు మూసేసి ఉంచారు అంటూ మెసేజ్ పెట్టాడు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ప్రపంచమే మహిళలను గౌరవిస్తుంది. దీనికి సూచనగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ-ప్రైవేటు సెక్టార్లలో పని చేస్తున్న మహిళా ఉద్యోగులందరికీ స్పెషల్ కాజువల్ లీవ్ ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను కూడా పట్టించుకోకుండా మహిళా ఉద్యోగులను అవమానిచెలా మాట్లాడటంతో ఖంగుతిన్న సదరు మహిళా ఉద్యోగి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా తెలంగాణ సియస్, స్టేట్ కో ఆర్డినేటర్, మహిళా కమిషన్ లకు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసింది.





