
*మహిళా దినోత్సవం సందర్భంగా చీరలు పంపిణీ చేసిన పోలెబోయిన శ్రీవాణి.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, కరకగూడెం, మార్చ్ 8.
కరకగుడెం మండలం, సమత్ భట్టుపల్లి గ్రామ పంచాయతీలో స్థానిక సర్పంచ్ పోలెబోయిన శ్రీవాణి ఘనంగా మహిళా దినత్సవ వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏ పి ఓ త్రిగుణ మాట్లాడుతూ మహిళలకు నేటి సమాజంలో స్వేచ లేదని,మహిళల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్న వాటిని అమలు చేయక,మహిళలకోసం పోరాడే వాళ్ళు లేనందువలన మనకోసం మనమే గళం వినిపించాలని, ప్రస్తుతం కాలంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను తీవ్రంగా ఖండిస్తూ అందరికి మహిళా దినత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
సమత్ భట్టుపల్లి సర్పంచ్ శ్రీవాణి మాట్లాడుతూ నేటి సమాజంలో ఎంత అభివృద్ధి చెందుతున్నామో అంత ఎక్కువగా మహిళలను అణచివేస్తున్నారని,మహిళలపై జరుగుతున్న సంఘటనలు ఖండిస్తూ తోటి ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తదనంతరం కార్యక్రమానికి హాజరైన వారందరూ కలిసి కేక్ కట్ చేసి, ఆడపడుచులందరికీ స్వీట్లు,చీరల పంపిణీ, ఆట పాటల కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలందరితో కనుల పండుగ వాతావరణo నెలకొంది.ఈ కార్యక్రమంలో ఏపీవో త్రిగుణ,పోలెబోయిన లక్ష్మి నరసమ్మ
స్థానిక మహిళా సంఘాలు, అంగన్వాడి కార్యకర్తలు, ఆశా వర్కర్లు, కరకగూడెం మండల పరిధిలోని పలు గ్రామాల నుండి విచ్చేసిన మహిళలు, పాత్రికేయులు,స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.





