
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి తుపాకుల రమేష్: మార్చ్ 08
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మానవసేవే మాధవసేవ వాట్సప్ గ్రూప్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు కేఎల్ రావు, న్యాయవాది పార్వతి,డాక్టర్ సుధాకర్, శ్రీనివాస్ చారిల సహకారంతో,బుధవారం మల్కాజ్గిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ 141 డివిజన్ పరిధిలోని,గౌతమ్ నగర్ చౌరస్తాలో జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు చీరలు బహూకరించి సన్మానించారు.ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ సమాజంలో అట్టడుగునా ఉన్న మహిళలకు కూడా గౌరవం దక్కిన రోజే మహిళా దినోత్సవ రోజుకు సకారం చేకూర్తుందని అనే సదుద్దేశంతో ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం రోజున గత ఆరు సంవత్సరాల నుండి జీఎస్ఎంసి పారిశుద్ధ్య కార్మికులను చీరలతో సన్మానిస్తున్నామని అన్నారు.కార్యక్రమంలో మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు,డాక్టర్ సుధాకర్,ఉదారి సత్యనారాయణ యాదవ్, విజయలక్ష్మి, శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.





