
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 7 :
మార్చి 7న హోలీ పండుగ జరుపుకుంటున్న ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్, ప్రముఖ న్యాయవాది,సోషల్ సర్వీస్ ఆర్గనైజర్ హమీద్ షేక్ తెలిపారు. అంతేకాకుండా మార్చి 8న జరగబోతున్న
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ “మహిళా దినోత్సవ” శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించనున్నట్టు హమీద్ షేక్ అన్నారు. పాఠశాలలలో..1 నుంచి 5వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు , 6 నుంచి10 వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన పోటీల్లో పాల్గొనేందుకు అర్హులని ప్రకటించారు. మహిళా దినోత్సవాన్ని ప్రతిబింబించే చిత్రాలను ఏ4 డ్రాయింగ్ షీట్ పై 1నుంచి 5 తరగతులు చదువుతున్న విద్యార్థులు పెయింటింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.”మహిళ” సాధికారతలో భాగంగా సామాజిక, రాజకీయ, సేవా రంగాల్లో మహిళలు నిర్వర్తించాల్సిన పాత్ర “ద రోల్ ఆఫ్ ఉమెన్ టు బీ డన్ ఇన్ సోషల్, పొలిటికల్, సర్వీస్ కేటగిరీస్ టు అచీవ్ ఉమెన్ ఎంపవర్మెంట్ “అంశంపై ఐదు ఏ-4 సైజ్ పేపర్ లకు మించకుండా ఇంటి వద్ద నుంచి లేదా ఉపాధ్యాయుల సమక్షంలో మంచి వ్యాసం రాసి తమకు పంపాలని కోరారు. ఇందులో ఉత్తమ వ్యాసాలను ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. మిర్యాలగూడ పట్టణంలోని పాఠశాలల్లో చదువుతున్న తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియం విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనాలని కోరారు. వ్యాసాలు రాసిన అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్, సంబంధిత తరగతి ఉపాధ్యాయులు..ధ్రువీకరణ చేయించుకున్న వ్యాసాలను న్యూ మున్సిపల్ కాంప్లెక్స్ లోని సనా మొబైల్స్, షాపు నెంబర్ 52 లో నేరుగా మార్చి 7వ తేదీ సాయంత్రం 8 గంటల లోపు అందజేయాలని కోరారు. వ్యాసం రాసిన పేపర్ పై భాగంపై పేరు, తండ్రి పేరు, తరగతి, ఫోన్ నెంబర్, స్కూల్ పేరు, పాఠశాల నెంబర్ కచ్చితంగా రాయాలని కోరారు. ఉత్తమ వ్యాసాలు అందించిన విద్యార్థులకు, మంచి పెయింటింగ్స్ చేసిన విద్యార్థులకు” అంతర్జాతీయ మహిళా దినోత్సవం “రోజున జ్ఞాపికలు, మెడల్స్ అందజేయనున్నట్టు హమీద్ షేక్ తెలిపారు.





