
జన సముద్రం న్యూస్, మార్చ్ 08,అనంతపురం:
అనపర్తి చంద్ర బాబు నాయుడు గారి సభలో పోలీసుల దాడిలో జరిగిన సంఘటనలో చంద్ర దండు ప్రకాష్ నాయుడు నీ పరామర్శించిన తెలుగు దేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు , కేంద్ర తెలుగు దేశం పార్టీ ఉపాధ్యక్షుడు బీద రవిచంద్ర యాదవ్ గారు , పట్ట బద్రుల mlc అభ్యర్థి భుమిరెడి రాం గోపాల్ రెడ్డి గారు చంద్ర దండు కి ఇలాంటి సవాళ్లు కొత్తేం కాదు అని గతం లో ఎన్నో సందర్భాల్లో ఇలాంటి సంఘటనలు ఎదుర్కొని నిలబడ్డా రక్షక దళం చంద్ర దండు అని తెలిపారు.
అనంతపురం చంద్ర దండు కార్యాలయం లో సందర్భంగా బీద రవిచంద్ర యాదవ్ గారు మాట్లాడుతూ రాష్ట్రం లో రాక్షసుడి పాలన జరుగుతోంది రావణాసుడి వద కు ప్రజలు సమాయత్తం అయ్యారు అని తెలిపారు.
రాష్ట్రం లో ఈ వైకాపా ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని తమ ప్రైవేట్ సైన్యం లా వాడుకుంటూ
నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర ను అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తూ అలాగే అనపర్తి ఘటనలో అయితే కేంద్ర బలగాలు వున్న సరే ఈ రాష్ట్ర పోలీసులతో చంద్ర బాబు నాయుడు గారిని అడ్డుకున్న వైనం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను నివ్వెర పోయేలా చేసింది లక్షలాదిమంది తెలుగు దేశం పార్టీ కార్యకర్తల్ని పోలీసులు అడుగడుగునా వెనక్కి నెట్టుకుంటూ చంద్ర బాబు నాయుడు గారి వాహనాలకు బారికెడ్లతో అడ్డు గా పెట్టిన చంద్ర దండు ప్రకాష్ నాయుడు తమ కార్యకర్తలతో పోలీసులను చాకచక్యం తో తమ అనుభవాన్ని ఉపయోగిస్తూ చంద్ర బాబు నాయుడు గారిని అనపర్తి సభకి చేరుకునేలా చేశారని ఆనాడు చంద్ర బాబు గారు ఒక్క సైగ చేసిన రాష్ట్రం లో ఈ వైఎస్ఆర్సీపీ జెండా మాటున పని చేస్తున్న కొంతమంది పోలీసులకు అలాగే వైఎస్సార్సీపీ ఆకతాయిలకు తగిన గుణపాఠం అక్కడి సభలో ప్రజలు బుద్ధి చెప్పేవారని కానీ మా నాయకుడు చంద్ర బాబు నాయుడు గారు క్రమశిక్షణ తో సమ్యవనం పాటించి పోలీసులకు సహాయనిరాకరణ పాటించాలని తమ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేసిన చంద్ర బాబు నాయుడు గారికి రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే దాదాపు కొంతమంది ఈ వైకాపా అధికార పార్టీకి కొమ్ము కాసే వారిని తెలుగు దేశం పార్టీ శ్రేణులు మీదకు వుసిగొల్పుతున్నరని త్వరలో ఈ రావణాసురడి జగన్మోహన్ రెడ్డి వధ కార్యక్రమాన్ని రానున్న ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు చేపడతారని చంద్ర దండు ప్రకాష్ నాయుడు త్వరగా కోలుకోవడం తెలుగు దేశం పార్టీకి శుభ పరిణామం అని చంద్రన్న భద్రత చంద్ర దండు బాధ్యత అని బీద రవిచంద్ర యాదవ్ గారు తెలిపారు.
రాబోయే పట్ట భద్రుల mlc ఎన్నికల్లో భూమి రెడ్డి రాం గోపాల్ రెడ్డి గారి గెలుపుకు కృషి చేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించేందుకు కృషి చేయాలని చంద్ర దండు ప్రకాష్ నాయుడు గారికి సూచించారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీ నాయుడమ్మ, బెస్త నారాయణ స్వామి, చంద్ర శేఖర్ నాయుడు,జగన్నాథ్, సుభాన్,సుధాకర్,నరేష్, సురేష్,సికిందర్,నేహా,గౌసియ, ఖాజా నిజాముద్దీన్, ఆలీ తదితరులు పాల్గొన్నారు.





