
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 4 :
మిర్యాలగూడ పట్టణంలోని మార్చి 1, 2 తేదీలలో జరిగిన తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలలో ధీరావత్ శ్రీను నాయక్ ను రాష్ట్ర మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఏకిగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
. ఈ సందర్భంగా శ్రీను నాయక్ మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు పడుతున్న ఇబ్బందులను,సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో ముందు ఉంటానని అన్నారు. అదేవిధంగా ఈ మహాసభల సందర్భంగా గిరిజనులకు సంబంధించిన అనేక తీర్మానాలు ఆమోదించడం జరిగింది. వాటిలో ముఖ్యంగా 12 శాతం రిజర్వేషన్, బ్యాంకులకు సంబంధం లేకుండా ట్రై కాన్ లోన్లు ఇవ్వాలని, గిరిజన అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని, గిరిజన రిజర్వేషన్లను రాజ్యాంగంలో తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం ఇలా అనేక తీర్మాణంలో ఆమోదించడం జరిగింది. పై తీర్మానాలన్నీ కూడా అమలయింతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సమరసిల పోరాటానికి సిద్ధం అని అన్నారు .ఈ ఎన్నికకు సహకరించిన నాయకులు అందరికీ కూడా” విప్లవాది వందనాలు “తెలియజేస్తున్నాన ని ధీరావత్ శ్రీను నాయక్ తెలిపారు. ఈ ఎన్నిక పట్ల విజయ్, రాజు,నవీన్, తరుణ్, సురేష్,అతిరం అనిల్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు





