
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, మార్చి 2
అంగన్వాడీల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా నని ఈ విషయంపై ఈరోజే ముఖ్యమంత్రికి లేఖ రాస్తానని సిపిఎం మాజీ ఎమ్మెల్యే జూలకటి రంగారెడ్డి అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన మార్చి 1, 2, 3 రోజుల సమ్మెలో భాగంగా రెండవ రోజు గురువారం అంగన్వాడీలు ఆర్డీఒ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డిఓ చెన్నయ్య కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ..
అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానాన్ని రద్దు చేయాలని, అంగన్వాడీలపై రాజకీయ ఒత్తిడి లను తగ్గించాలని కోరారు. అంగన్వాడి కేంద్రాలకే ఫుడ్ సరఫరా చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ ఉద్యోగులకు గ్రా డ్యూటీ చెల్లించాలన్నారు వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలన్నారు.టీచర్లతో సమానంగా అంగన్వాడీ ఉద్యోగులకు వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సౌకర్యాలు కల్పించాలని కోరారు. ఖాళీ
పోస్టులు వెంటనే భర్తీ చేసి ఈ సమస్య పరిష్కార కోసం తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు.అంగన్ వాడీ ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు అమలు చేయాలన్నారు. ఎండకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలన్నారు. జివో నెం 14, 19, 8 లను వెంటనే సవరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు డబ్బికార్ మల్లేష్, డాక్టర్ మల్లు గౌతమ్ రెడ్డి, ఆయూబ్, అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకురాలు..పార్వతి ప్రమీల, తుడి అరుణ, స్వరాజ్యం బెజ్జం నాగమణి, స్వరాజ్యం, జి. రజిత, ఝాన్సీ, రాధాబాయి, విజయ, శేషు మని, గౌసియా, చంద్రకళ, మండే వనజ, నాగమణి, శ్రీదేవి, ఉమా, తదితర అంగన్వాడీ ఉద్యోగులు పాల్గొని ఆర్డీవో కు” వినతి పత్రం” అందజేశారు.





