
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి మార్చ్ 02:తుపాకుల రమేష్
గురువారం చనిపోయిన పోలీసు కుటుంబాలకు తొందరగా పెన్షన్ మరియు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని రాచకొండ సీపీ ఆదేశించారు. రాచకొండ కమినరేట్ పరిధిలో పనిచేస్తూ చనిపోయిన పోలీసు కుటుంబ సభ్యులకు ఈరోజు సిపి రాచకొండ చౌహాన్ భద్రత, ఎక్స్ గ్రేషియా చెక్కులను సీ.పీ ఆఫీస్ లో స్వయంగా అందజేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారిని ఆప్యాయంగా పలకరించి నేనున్నానని భరోసాని రాచకొండ సీ.పీ చౌహాన్ కల్పించారు.
పోచంపల్లి పోలీస్ స్టేషన్ లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తూ మరణించిన జాన్సన్ భార్య సునీత కు భద్రత నుండి 7,99,160 రూపాయలు, విడో ఫండ్ 10,000/-, ఫ్లాగ్ ఫండ్ 10,000/-, కార్పస్ ఫండ్ 50,000/- చెక్కులను
మల్కాజిగిరి పొలిస్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తూ మరణించిన నరేష్ కుమార్ బార్య లక్ష్మిబాయి కి భద్రత నుండి 3,93,700/-, కూతురు పేరు పై 1,96,850/-, కొడుకు పేరుపై 1,96,850/- రూపాయల చెక్కులను, రాచకొండ సీ.పీ చౌహాన్ చేతుల మీదుగా వారి కుటుంబాలకు అందజేశారు.
ఈ సందర్భంగా సిపి డి.ఎస్ చౌహన్ ఐ.పి.ఎస్ మాట్లాడుతూ.. చనిపోయిన రెండు కుటుంబాలకు తొందరగా పెన్షన్ మరియు ఉద్యోగం వచ్చే విధంగా చూడాలని రాచకొండ అడ్మిన్ అడిషనల్ డి.సి.పి నర్మద, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి మరియు మినిస్టిరియల్ సిబ్బందిని సీ.పీ ఆదేశించారు.
సిబ్బంది సంక్షేమమే ముఖ్యం : సీపీడి.ఎస్ చౌహన్
సిబ్బంది సంక్షేమమే ముఖ్యమని రాచకొండ సీ.పీ అన్నారు.
9 నెలలుగా పెండింగ్లో ఉన్న టీ ఏ బిల్లు ఎమౌంట్ ను సి.పి సకాలంలో మంజూరీ చేసినందుకు రాచకొండ పోలీస్ సిబ్బంది సంతోషంగా ఉన్నారని, సీ.పీ విశేష కృషి వల్ల పెండింగ్ లో ఉన్న టీ ఏ సకాలంలో వచ్చినందుకు పోలీస్ అధికారుల సంఘం కృతఘ్నతలు తెలియజేసినారు. ఈ కార్యక్రమములో అడిషనల్ డిసిపి అడ్మిన్ సి. నర్మద, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు భద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






