
దాతల సహాయం కోరుతున్న చిన్నారులు.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 28.
రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబం,ఇంటి స్థలం లేదు వుండటానికి ఇల్లు లేదు,బ్రతుకుజివుడా అంటూ పొరుగు ఇళ్ళల్లో తల దాచుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో క్యాన్సర్ అనే మహమ్మారి వచ్చి కుటుంబాన్ని అతలా కుతలం చేస్తుంది.ఇద్దరి చిన్నారుల వేదన,అమ్మ కావాలి అనే బాధ పలువురి హృదయాలను కలచివేస్తుంది. దాతల సహాయం కోరుతున్న చిన్నారులు మా అమ్మ ను బ్రతికించమని వేడుకుంటున్న కుటుంబం.
పినపాక మండల పరిధిలో గల పెంటన్నగూడెం గ్రామానికి చెందిన సల్లూరి జ్యోతి వయస్సు30, భర్త ప్రసాద్ వీరికి ఇద్దరు పిల్లలు పావని వయస్సు 12, శెశి కుమార్ వయస్సు 10 .ఆరు నెలల క్రితం బాగా నీరసంగా వుండటంతో హాస్పిటల్ కి వెళ్ళగా డాక్టర్ పరీక్షలు చేసి రక్త శాతము తక్కువ వుందని రక్తము వెక్కించారు. అప్పటి నుండి హాస్పిటల్ కి వెళ్ళే ఆర్థిక స్తోమత లేక అప్పు పుట్టక కుటుంబ పోషణ కోసం నానా కష్టాలు పడుతున్న పరిస్థితులలో కొన్ని రోజుల క్రితం కడుపులో నొప్పి తీవ్రంగా రావడంతో మణుగూరు హాస్పిటల్ కి వెళ్ళగా అక్కడి డాక్టర్ ఖమ్మం పంపించారు. ఖమ్మం హాస్పిటల్ లో అన్ని పరీక్షలకు డబ్బులు లేక బంధువులను బ్రతిమలాడి 50 వేల అప్పుగా తీసుకొని అన్ని పరీక్షలు చేయించి, ఐ సి యూ లో వారం రోజుల పాటు చికిత్సనందించారు. అక్కడి నుండి హైదరాబాద్ హాస్పిటల్ కి వెళ్ళాలని ప్రయత్నించగా ఊరిలో కొందరి దగ్గర 2 లక్షలు అప్పు చేసి హైదరాబాద్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారు.అక్కడ అన్ని పరీక్షలు చేసి గర్భాశయ క్యాన్సర్ నాల్గవ దశలో వుందని చెప్పారు.ఆపరేషన్ చేయాలంటే 6-12 లక్షల వరకు ఖర్చువుంతుందని తెలపటంతో భర్త ప్రసాద్ వద్ద డబ్బులు లేక ఇంటికి తీసుకువచ్చారు. చికిత్స కు డబ్బులు లేక రోజు వాడటానికి మందులు లేక దీనావస్తలో ఉన్న కుటుంబం దినసరి కూలికి వెళ్తే పొట్ట పోసుకునే జ్యోతి కుటుంబానికి ఈ మాయదారి రోగం దాపురించి కుటుంబాన్నీ కల్లోలం పెడుతుంది. ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేసి మా అమ్మ ప్రాణాలు కాపాడాలని ఇద్దరు చిన్నారులు చేతులెత్తి మొక్కుతున్నారు. ఫోన్ పే నెంబర్ 8096327423,దయగల దాతలు వెంటనే స్పందించాలని కన్నీటితో ఆ కుటుంబం వేడుకుంటుంది.





