
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 24:
మిర్యాలగూడ పట్టణ మరియు గ్రామాల ప్రజలకు మిర్యాలగూడ డిపో మేనేజర్ బో ల్లెద్దు పాల్ తెలియజేయునది ఏమనగా… ఫిబ్రవరి 25వ తేదీన మిర్యాలగూడ ఆర్టీసీ డిపో కార్యాలయంలో జరుగు
” డయల్ యువర్ డిఎం “కార్యక్రమంలో డిపో మేనేజర్ పాల్ కు.. ఆర్టీసీ బస్సులు మీ గ్రామాలకు సరైన సమయంలో వస్తున్నాయా..?, ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు.. పనితీరు ఎలా ఉంది..?, ఇంకా ఏమైన మీ సలహాలు,సూచనలు మరియు సమస్యలు తెలియజేయుటకు 9959226308 నెంబరుకు ఉదయం 11.00గం ‘ల నుండి 12.00గం’ ల వరకు ఫోన్ చెయ్యగలరని మిర్యాలగూడ డిపో మేనేజర్ బొల్లెద్దు పాల్ తెలిపారు.





