
విజేతలను అభినందించిన జిల్లా అధ్యక్షులు కొండ విజయ్ కుమార్
జనసముద్రం న్యూస్, చందానగర్ , (ఫిబ్రవరి 22)
చందానగర్ పీజేర్ స్టేడియం కు చెందిన అథ్లెటిక్స్ రంగారెడ్డి జిల్లా క్రీడాకారులు ఫిబ్రవరి 16-19 వరకు హర్యానా లోని కురుక్షేత్ర ద్రోణాచార్య స్టేడియంలో లో జరిగిన 4వ జాతీయ స్థాయి మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలలో రంగారెడ్డి జిల్లా నుండి 10 మంది క్రీడాకారులు పాల్గోని 10 పతకాలు సాధించారు వీటిలో 3 బంగారు, 4 రజతం , 3 కాంస్యం పతకాలు సాధించారు మహిళా విభాగంలో మానసపలి నాలుగు పతకాలు, భవాని మూడు పతకాలు, డేవిడ్ రాజు ఒకటి, యేసురత్నం రెండు పతకాలు సాధించారు 25 రాష్ట్రాలు నుండి పాల్గొన్న ఈ జాతీయ పోటీలలో 2000 మంది క్రీడాకారులు పాల్గొనగా తెలంగాణ రాష్ట్రంనుండి 150 మంది క్రీడాకారులు పాల్గొని 100 పతకాలకు పైగా సాధించారు జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న వారిలో జిల్లా ప్రధాన కార్యదర్షి నూనె సురేందర్, జి బాలరాజు, అనిల్ కుమార్, ఆనందరాజ్, గోపాల్, ప్రభులయ్యలు ఉన్నారు జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించన వారిని జిల్లా అధ్యక్షులు కొండా విజయ్ కుమార్ అభినందించారు






