
మల్కాజ్గిరి కౌకూర్ జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 21
మల్కాజ్గిరి జిల్లా కౌకూర్ భరత్ నగర్ లో ప్రభుత్వ భూములు కబ్జాలకు పాల్పడుతున్నారు. డూప్లికేట్ పట్టాలు సృష్టించి లక్షలలో అమ్మకాలు జరుపుతున్నారు వివరాల్లోకి వెళ్తే కౌకుర్ భరత్ నగర్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన మల్లికార్జున్. భరత్ నగర్ సర్వేనెంబర్ 27 లో గత ప్రభుత్వం రాజీవ్ గృహకల్ప మరియు బాంబే హౌసెస్ పేదలకు ఇండ్లు నిర్మించారు బాంబే హౌసెస్ ప్రక్కన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి
కుంట చెరువును రాత్రి లో ట్రాక్టర్ జెసిపిలతో వట్టి నింపుతున్నాడు కుంట కట్ట ను పూడ్చివేసి ప్లాట్లు చేసి తనకు నచ్చిన విధంగా 40 గజాలు 60 గజాలు 80 గజాల చొప్పున తనకు అనుకూలము ఉన్నవారికి దగ్గరుండి ఇండ్లు కట్టించి వాళ్ల దగ్గర నుండి మూడు లక్షల నుండి ఐదు లక్షల రూపాయల వరకు తీసుకుంటూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దృష్టికి తీసుకొని వెళ్లాలనుకున్న వ్యక్తులపై బెదిరించి దాడి చేశాడు. ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు.





