
బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ .
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ఫిబ్రవరి 19 :ప్రతినిధి తుపాకుల రమేష్
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా వినాయక్ నగర్ డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు అజయ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి మహేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ .
ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్నికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లెల రవి యాదవ్ ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతూ హిందూధర్మ పరిరక్షణ కోసం చేసిన సేవలను కొనియాడారు. శివాజీ తల్లి జిజియా బాయి శివాజీ చిన్నతనంలోనే రామాయణ, భారత భాగవతలను అవాపోసన పట్టించడం జరిగింది, చిన్ననాటి నుండి శివాజీకి హిందుత్వం అంటే చాల అభిమానం, మొగులాయుల పాలనలో అణచివేత కు గురిఅవుతున్న హిందువులను చూసి చలించిన శివాజీ తన 17వ ఏటనే మొదటి యుద్ధం చేసి గెలిచిన ధైర్యశాలి.శివాజీ పేరు చెపైనే మొగులాయులు గజగజ వణికి పోయేవారు.ఆయన యుద్ధానికి వస్తే పలాయనం చిత్తగించేవారు, ఛత్రపతి శివాజీ మరాఠా రాష్టానికే కాదు యావత్ దేశానికి ఆయన ఆదర్శం. ఒక ధీరుడు,ఒక యోధుడు ధర్మ రక్షణ కు ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగాఎలా ఉండాలో యువత శివాజీ ని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సర్వేశ్ యాదవ్, ఆర్.మణి రత్నం, ఆకారం సాయి రామ్, సురేందర్ యాదవ్, ఉడుత నవీన్ తదితరులు పాల్గొన్నారు.





