
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 17.
పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ రైతు వేదికలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, స్థానిక సర్పంచ్ బాడిశ మహేష్, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులు ,నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించటం జరిగినది. దీనిలో భాగంగా ప్రభుత్వ దవాఖానాలో రోగులకు, గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, పండ్లు అందించి, రైతు వేదిక ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత కేసీఆర్ హయాంలో ఎనలేని అభివృద్ధిని ,సంక్షేమ పథకాలను ప్రజల కోసం రూపొందించిన గొప్ప మహనీయుడు, ఆదర్శప్రాయుడు సీఎం కేసీఆర్ అని తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను పలు రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, పిఎసిఎస్ చైర్మన్ డాక్టర్ రవి శేఖర్ వర్మ, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్,అమరారం సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, పిఎసిఎస్ డైరెక్టర్ పటేల్ కామేశ్వరరావు, గ్రామ అధ్యక్షులు గుండం దామోదర్, రైతులు ముళ్ళపూడి ప్రకాశం, పాటి పండ్ల సత్యనారాయణ, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దినసరపు శ్రీనివాస్ రెడ్డి, ముళ్ళపూడి సత్యనారాయణ, సూరినేని ధర్మయ్య, బెడద శ్రీను, బియ్యాల మురళి, శిరిడీనేని ఆంజనేయులు, సోయం విష్ణుమూర్తి, పాండురంగాపురం ఉపసర్పంచ్ పూణెం సాంబశివరావు, గుమ్మడి అశోక్ ,జాడి రామకృష్ణ, రైతులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, వార్డ్ మెంబర్స్ పాల్గొనడం జరిగినది.





