
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 16:
మిర్యాలగూడ మండలం లోని ముల్కలకాల్వ గ్రామంలో నూతనంగా కోదండ రామాలయ ఆలయ నిర్మాణానికి ఫిబ్రవరి 16 న జరిగిన భూమి పూజ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు , తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహా రెడ్డి నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అద్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మాట్లాడుతూ..
మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధికి నా కృషి ఎప్పుడు ఉంటుందని, నూతనంగా నిర్మిస్తున్న కోదండ రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజను పూజారుల వేదమంత్రాలతో దగ్గరుండి నిర్వహించి, కోదండరాముడు దీవెనలతోతెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని భాస్కర్ రావు ఇంకా మరెన్నో విషయాలు తెలిపారు. ఈ
కార్యక్రమంలో వీరితోపాటు మిర్యాలగూడ మండల ఎం.పి.పి నూకల సరళ హనుమంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటి చైర్మన్ ధనవత్ చిట్టిబాబు నాయక్, పాక్స్ చైర్మన్ వేలిశెట్టి రామకృష్ణ, మండల పార్టీ అద్యక్షులు మట్టపల్లి సైదులు యాదవ్, పూసపాటి రాజయ్య, సర్పంచ్ రాజు, మాజీ ఎం.పీ.టీ.సీ రవి, సకినాల హరి ప్రసాద్, దారం సైదులు, చామర్తి వెంకటేశ్వర్లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు “కోదండ రామాలయ భూమి పూజ”లో పాల్గొన్నారు.





