
- బి జె వై ఏం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 16
ప్రభుత్వం, పోలీసు నియామక బోర్డ్ తప్పిదాలతో కోర్ట్ మొట్టికాయలు, యువమోర్చా పోరాటం ఫలితంగా 7 మార్కులతో అర్హత సాధించిన అభ్యర్థులల్లో గర్భిణులను తప్పక ఫిజికల్ ఫిట్నెస్ పరీక్షల్లో తప్పకుండా పాల్గొనాలని అధికారాలు అనడం సిగ్గుచేటు, కనీస మానవీయ కోణంలో ఆలోచనలేని ప్రభుత్వం, అధికారులు ఉండటం తెలంగాణ దౌర్భాగ్యంగా భావిస్తున్నాం,
నియమాలు పొరపాట్లు, ప్రశ్న పత్రాల్లో తప్పులు, ఏర్పాట్లలో డొల్లతనం, పోటీలలో పాల్గొన అభ్యర్థులకు కనీస అవసర ఏర్పాట్లు చేయటంలో పూర్తిగా విఫలమైన బోర్డ్ తప్పిదాలను అన్నింటిని కప్పిపుచ్చుకుని,
ఉత్తీర్ణత సాధించిన మహిళ అభ్యర్థుల్లో ఉన్న గర్భిణులు డైరెక్ట్ గా మెయిన్స్ పరీక్షల్లో పాల్గొనవచ్చని, మెయిన్స్ లో సెలెక్ట్ అయిన వారికి తరువాత ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తామని అధికారికంగా తెలిపిన విషయాన్ని కాదని ఇప్పుడెలా వందలాది గర్భిణులను ఏవిధంగా ఫిజికల్ పరీక్షల్లో పాల్గొనమని చెప్తారు?
ఏండ్ల తరబడి ఉద్యోగలకోసం ఎదురు చూస్తున్న మహిళ అభ్యర్థుల పట్ల ఇంతటి హేనమైన విధానాన్ని అవలంభించడం ప్రభుత్వం, అధికారులకు రాష్ట్రంలోని మహిళల పట్ల వారి వివక్షతకు పరాకాష్ట.
గర్భిణీ మహిళల పరిస్థితిని అర్థం చేసుకోలేని మూర్ఖులు అధికారం ఉండి మనల్ని పాలించడం రాష్ట్రానికే కళంకం.
రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి సెలెక్ట్ అయిన అభ్యర్థుల్లో గర్భిణీలకు మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలని, సెలెక్ట్ అయిన అభ్యర్థులకు తరువాత ఫిజికల్ పరీక్షలు నిర్వహించాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో యువమోర్చా ఆధ్వర్యంలో అభ్యర్థులతో కలిసి పెద్ద సంఖ్యలో డి.జి.పి ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాం.





