
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 15 :
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర రావు తెలియజేయునది ఏమనగా.. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ నుంచి నీటి విడుదల రేపు “వారబంధి” లో భాగంగా నిలిపివేస్తున్నారని తెలిపిన సందర్బంగా “నల్లమోతు భాస్కర్ రావు” రైతుల పక్షాన నిలబడి.. నీరు లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని సంబందిత ఇరిగేషన్ శాఖల అధికారులతో మాట్లాడి నీటి విడుదల నిలిపివేయకుండా నిరంతరాయంగా ఇచ్చేటట్టు ఏర్పాటు చేయించారు.
ఈ సందర్భంగా ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు రేపు కూడా నీటి విడుదల యధావిధిగా కొనసాగుతుంది. రైతులందరూ ఈ విషయాన్ని గమనించి నీటిని పొదుపుగా వాడుకోగలరని శాసనసభ్యులు నల్లమోతు భాస్కరరావు ఆదేశించారు .





