
జనసముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, ఫిబ్రవరి 13 :
మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని నాగార్జునసాగర్ నియోజకవర్గం ,త్రిపురారం మండలంలోని వస్త్రం తండా గ్రామపంచయతిలోని “లక్పతి తండా” గ్రామానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి “ధనావత్ తారు నాయక్” పదిరోజుల క్రితం అకస్మాత్తుగా మరణించటం జరిగింది. ఫిబ్రవరి 13 సోమవారం న ఉమ్మడి
నల్లగొండ జిల్లా శాసనమండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి వారి స్వగృహానికి చేరుకొని దశదిన కార్యక్రమంలో పాల్గొని
“ధనా వత్ తారు నాయక్” చిత్ర పటానికి పూలమాల, పూలు వేసి తమ నివాళులర్పించారు. ఇంతే కాకుండా తారు నాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ని తెలియజేసీ, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తో పాటు
జిల్లా బి.ఆర్.యస్ నాయకులు.. మార్తి, భరత్ రెడ్డి ,అనుముల అనంత రెడ్డి,అనుముల శ్యాంసుందర్ రెడ్డి, ధనవత్ బాలునాయక్, కార్యకర్తలు, పలు పార్టీ నాయకులు, న్యాయవాదులు, తారా నాయక్ అభిమానులు, తండా ల ప్రజలు తదితరులు పాల్గొని “తారా నాయక్ “కు అశ్రునివాళ్ళు అర్పించారు.






