
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 9 :
మిర్యాలగూడ పట్టణంలోని మిర్యాలగూడ ఏరియా హాస్పిటల్ లో లయన్స్ క్లబ్
ఆధ్వర్యంలో ఫలహార వితరణ కార్యక్రమం 93వ రోజుకు చేరింది .” ఎంతోమంది ఆకలి తీర్చే ” ఈ అద్భుతమైన కార్యక్రమానికి దాతలు.. సహకరించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ “ఫలహార వితరణ ” కు మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలే కాకుండా నియోజకవర్గాలు అయినటువంటి నాగార్జునసాగర్, దేవరకొండ, హుజూర్ నగర్ వంటి దూర ప్రాంతాల నుంచి అనేకమంది పేద ప్రజలు తమ ఆకలి తీర్చుకోనుటకు నిత్యం వస్తూనే ఉంటారు. పేదవారి బాధలు అర్థం చేసుకొని వారికి నిత్యం ఫలహారాన్ని అందిస్తూ, ఆకలి తీరుస్తూ సేవ చేస్తున్నటువంటి లయన్స్ క్లబ్ సాయం మరవలేనిది. అదేవిధంగా సేవ చేయడానికి ప్రజలను దాతలుగా, భాగస్వామ్యం చేసి అవకాశం కల్పించడం మంచి ఆలోచన.
ఈ సందర్భంగా నల్లగొండ జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా అధ్యక్షులు చలమల్ల సీతారాం రెడ్డి కుమారుడు చలమల్ల హేమంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా 93 రోజు ఫలహారం పంచడం జరిగింది. ఈ మహోన్నతమైన కార్యక్రమానికి కార్మిక నాయకుడు సీతన్న , పెదమాం వెంకన్న,భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొనడం జరిగింది.





