
ప్రజా ప్రతినిధులు : సత్యనారాయణ గౌడ్, బాబుల్ రెడ్డి, వెంకటేష్ యాదవ్, భగవన్ రెడ్డి
మెదక్ జిల్లా, ప్రతినిధి( జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి: 9
కంటి వెలుగు పథకం నిరుపేద లకు ఎంతో మేలు చేస్తుందని సర్పంచ్ వెంకట్ రామ్ రెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్ గ్రామంలో గురువారం రోజున కంటి వెలుగు పథకాన్ని ప్రజా ప్రతినిధులతో కలిసి గ్రామ సర్పంచ్ నాగులపల్లి వెంకట్ రామ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించడంతో నిరుపేదలకు కచ్చితంగా కంటి పరీక్షలు మందులు అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గ్రామ సర్పంచ్ వెంకట్రాంరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హయాంలో నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కంటి వెలుగు పథకాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలు కూడా వారి వారి రాష్ట్రాల్లో అమలు చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డి ఎల్ పి ఓ శ్రీనివాసరావు , రాంగిరి రమేష్, రమేష్, మండల పార్టీ అధ్యక్షుడు బొల్లంపల్లి బాబుల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, గడ్డి వెంకటేష్ యాదవ్, తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కావేరి భగవాన్ రెడ్డి, ఎంపిటిసి నరసమ్మ, సర్పంచ్ నాగులపల్లి వెంకట్రాంరెడ్డి, ఉప సర్పంచ్ మల్లమ్మ, గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు, డాక్టర్లు ఆనంద్, డాక్టర్ అపర్ణ, ఏంఏన్ ఏం జ్యోతిలక్ష్మి, ఆశ వర్కర్ లక్ష్మి, వైద్య సిబ్బంది, గ్రామ ప్రజలు,నాయకులు రాజు ఇస్లాoపుర్ తదితరులు పాల్గొన్నారు.






