
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 9.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, జానంపేట గ్రామపంచాయతీ పరిధిలోని పలు గ్రామాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సతీమణి సుధారాణి విస్తృతంగా పర్యటించారు.ఇటీవల వివిధ కారణాలతో మరణించిన కుటుంబ సభ్యుల నివాసాలకు వెళ్లి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.దీనిలో భాగంగా ఇనపాల విజయ్ కుమార్ (22), యర్రం శెట్టి రాధ (60), కోట్ర శివ (27) సంవత్సరాలు, నూనే మంతల శ్రీను (40), చింత వెంకటేశ్వర్లు (37) సంవత్సరాలు ఇటీవల కొన్ని రోజుల క్రితం మరణించడంతో మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి దశదినకర్మలకు హాజరయ్యారు. అదేవిధంగా జంపన వెంకట అప్పల నరసింహారాజు అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారినివాసానికి, పొత్తురి శ్రీనివాస్ రాజు ఇటీవల కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ ఆపరేషన్ చేపించుకుని ఇంటిదగ్గర విశ్రాంతి తీసుకుంటున్న వారిని పరామర్శించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఐదు కుటుంబాలకు 5000 రూపాయలు చొప్పున, మొత్తం 25 వేల రూపాయల నగదును, అదేవిధంగా ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం చొప్పున బాధిత కుటుంబ సభ్యులకు రేగా సుధారాణి చేతుల మీదుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేసి వారు భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ డాక్టర్ ముదునూరి రవి శేఖర్ వర్మ, మండల సొసైటీ డైరెక్టర్ పటేల్ కామేష్, జానంపేట సర్పంచ్ బాడిషా మహేష్, ఉప సర్పంచ్ రాయల సత్యనారాయణ, ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, పినపాక నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు యాంపాటి సందీప్, మండల యువజన విభాగం అధ్యక్షుడు గాండ్ల అశోక్, బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుండు దామోదర్, నాయకులు సూరినేని ధర్మయ్య,జి వినయ్, శ్రీనివాసరావు, సుగ్యాల శశికాంత్, సుగ్యాల శ్రీకాంత్, మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది రేగా రవి, బొండబోయిన ఉమామహేశ్వరరావు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.





