
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, ఫిబ్రవరి 8.
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా బిఆర్ఎస్ సంక్షేమ పథకాలపై రూపొందించిన కరపత్రాన్ని పినపాక మండలం, ఉప్పాక గ్రామంలో అంటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప్పాక బి ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందని కుటుంబం అంటూ లేదని, దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు మూడోసారి ఎమ్మెల్యేగా గెలవడం ఖాయం అని ప్రజలు భావిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ సర్పంచ్ పునేం సుజాత, ఉప సర్పంచ్ గుంటుపల్లి రామారావు, సొసైటీ డైరెక్టర్ కొండేరు రాము, పినపాక మండల సోషల్ మీడియా అధ్యక్షులు శ్యామల సతీష్, వార్డు నెంబర్ పునెం సాంబశివరావు,తాటి సంపత్,గుమసు గోవర్దన్, సారయ్య, కారం ముత్తయ్య, గద్దల నగేష్,మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.





