రంగంపేటలో అక్రమ వెంచర్ల హవా

Spread the love
  • మామూలు మత్తులో అధికారులు…..
  • రాజకీయ నాయకుల కనుసైగల్లో నడుస్తున్న మట్టి తవ్వకాలు….
  • కానరాని అధికారులు, ఆందోళనలో ప్రజలు…
  • అక్రమ వెంచర్లపై ‘ జన సముద్రం ‘ ప్రత్యేక కథనం…. మెదక్ జిల్లా, ప్రతినిధిఎర్ర పురుషోత్తం (జన సముద్రం న్యూస్) ఫిబ్రవరి :6

మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వెంచర్లు రాత్రి మట్టి తవ్వకాలు నడుస్తున్న
పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు మామూలు మత్తులో నిబంధనలకు తిరోధకాలిస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేయాలంటే కనీసం 10 శాతం స్థలాన్ని గ్రామపంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కనీస సౌకర్యాలైన డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్తు మంచినీటి సౌకర్యం రోడ్లు పార్కు లాంటి వసతులు కల్పించి గ్రామపంచాయతీకి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామపంచాయతీ, మండల పంచాయతీ అధికారులు వాటిని పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో డిటిసిపి అనుమతికి పంపాలి. డిటిసిపి అనుమతులు వచ్చిన తర్వాత ప్లాట్లను విక్రయించాల్సి ఉంటుంది. రంగంపేట లో ఉన్న ఐదు వెంచర్లలో కనీస వసతులు కరువయ్యాయి. అక్రమ పెంచర్లకు రాజకీయ నాయకుల అండ దండాలతోనే మట్టి వ్యాపారం నడుస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు గానీ, పోలీసులు వివిధ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పనులు అక్రమంగా మట్టి తవ్వకాలు తవ్వితే ఎంతటి వారైనా శిక్షించాలని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. గతంలో కొల్చారం మండలం కొంగోడు పాఠశాల ఆవరణలో జెసిపిలతో తీసిన గుంతలలో స్కూల్ విద్యార్థులు గుంతలో పడి చనిపోయిన విషయం అధికారులకు, పోలీసులకు, రాజకీయ నాయకులకు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇంత జరుగుతున్న జెసిపిలతో మట్టి తవ్వకాలు తీసుకుంటూ వెంచర్లకు మట్టి సరఫరా చేస్తున్న అధికారులపై , పోలీస్ శాఖపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొల్చారం మండలం గ్రామ ప్రజలు కోరుతున్నారు…

*గ్రామపంచాయతీ పాలకవర్గం ఏం చేస్తుంది?

రంగంపేట గ్రామంలో అక్రమ వెంచర్లకు జెసిపి టిప్పర్లతో మట్టి తవ్వకాలు తవ్వి వెంచర్లకు సరఫరా చేస్తున్నా గ్రామపంచాయతీ పాలకవర్గం ఏం చేస్తుందో, అసలు గ్రామపంచాయతీ సిబ్బందికి ఎంత ఆముదాని ఉందో అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు , పోలీస్ శాఖ వారు వెంచర్లకు అక్రమంగా నడుస్తున్న మట్టి తవ్వకాలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రంగంపేట గ్రామ ప్రజలు కోరుతున్నారు.

  • Related Posts

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    Spread the love

    Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    Spread the love

    Spread the loveకైరోలో జరుగుతున్న ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి ఈషాసింగ్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు. మహిళల 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రతిభ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

    భర్త లేని లోకంలో ఉండలేను

    భర్త లేని లోకంలో ఉండలేను

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

    బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్

    *iBomma నిర్వాహకుడు రవి అరెస్ట్