
మల్కాజ్గిరి తాసిల్దార్ వెంకటేశ్వర్లు
మల్కాజ్గిరి జనసముద్రం న్యూస్ ప్రతినిధి ఫిబ్రవరి 06
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీఓ.నెంబర్ 58,59 ద్వారా రెగ్యులరైజేషన్ స్కీమును తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అప్పుడు అవకాశం ఉపయోగించుకొని వారు ఇప్పుడు మళ్లీ జీఓ నెంబర్ 59 ప్రకారం మళ్ళీ అవకాశం ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా మల్కాజిగిరి లో మొత్తం 732 అప్లికేషన్లను స్వీకరించడం జరిగింది. ఇందులో అర్హులైన అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందని మల్కాజిగిరి తాసిల్దార్ తెలిపారు. దానికి సంబంధించి రుసుము వివరాలను అర్హులకు నోటీసులో తెలపడం జరిగిందని అందులో తెలిపిన విధంగా రసుము ను మార్చి నెల లోపల పూర్తీగా కట్టాలని మల్కాజిగిరి తాసిల్దార్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ అవకాశాన్ని నోటీసులు అందుకున్న అర్హులు అందరూ తొందరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మల్కాజ్గిరి తాసిల్దార్ తెలియజేశారు .





