
జనసముద్రం న్యూస్ ప్రతినిధి ,డి.శ్రీనివాస్, పినపాక ఫిబ్రవరి 4.
.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పినపాక మండల ఎంపీపీ గుమ్మడి గాంధీ అన్నారు. సీతంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పలువురు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని దీనిలో భాగంగానే సీఎంఆర్ఎఫ్ నిధిని బాధిత ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుందని అన్నారు. ప్రజా ప్రతినిధులు , అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలన్నారు . అలాగే పార్టీ నాయకులు సంక్షేమ పథకాల అమలుకు కృషి చేయాలని, గ్రామస్థాయిలో ఉన్న వివిధ సమస్యలను ప్రజా ప్రతినిధుల దృష్టికి అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. రానున్న వేసవి కాలం దృష్ట్యా గ్రామాల్లో మంచినీటి సరఫరా , మిషన్ భగీరథ నీటి సరఫరా విషయంలో ఏమైనా మరమ్మత్తులు ఉంటే సత్వరమే జరిపించాలని పంచాయతీ ల సర్పంచులను, కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీతంపేట ,ఉప్పాక సర్పంచులు పోతినేని శివ శంకర్, సుజాత, ఉప సర్పంచ్ కొండేరు నాగభూషణం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వార నరసింహారావు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.





