
జన సముద్రం న్యూస్, త్రిపురారం మండలం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, ఫిబ్రవరి 3 :
చదువుకునే పదవ తరగతి విద్యార్థిని, విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా సాయంత్రం సమయాలలో 10వ తరగతి విద్యార్థులకు “అల్పాహారం” అందించేందుకు త్రిపురారం జడ్పిటిసి దనవత్ భారతి భాస్కర్ నాయక్ తన వంతు విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు. త్రిపురారం మండలంలోని చెన్నై పాలెం ఉన్నత పాఠశాలలో అల్పాహారం అందించే విషయమై పాఠశాల ఉపాధ్యాయులు జెడ్పిటిసి ధనావత్ భారతీ భాస్కర్ నాయక్ ను అడగగా..” 5000 రూపాయల ఆర్థిక సహాయం” అందించారు.

జెడ్పిటిసి భారతి భాస్కర్ నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆకలితో అలమటించోద్దని, చదువుకు ఆటంకం ఏర్పడవద్దనే ఉద్దేశంతో సాయంత్రం వేళ బిస్కెట్లు,పల్లి పట్టిలు,శనగలు అందించాలని 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశానని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి తల్లిదండ్రులతోపాటు పాఠశాలకు పేరు,ప్రఖ్యాతలు తీసుకరావాలని భారతి భాస్కర్ నాయక్ తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి “ఉత్తీర్ణతతో” ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు సాయం చేసే విషయంలో వెనుకడుగు వేసేది లేదని భారతి భాస్కర్ నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతి భాస్కర్ నాయక్ తో పాటు గ్రామ సర్పంచ్ నామరాజు,మాజీ సర్పంచ్ సైదయ్య,ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు.. గోపి.. లు , ఉపాధ్యాయులు.. సత్యనారాయణ,సైదయ్య, అంజమ్మ,సైదులు, మ క్లానాయక్, ఎం ఎన్ స్వామి,మాలోతు దశరథ నాయక్, శ్రీదేవి, శ్రీనివాస్, దుర్గా మల్లేశ్వరి జ్యోతి తిరుపమ్మ… లు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.





