
◆ ముఖ్యఅతిథిగా పాల్గొన్న సామాజిక కార్యకర్త కర్నె రవి.
◆ జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్.
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి. శ్రీనివాస్, పినపాక, జనవరి 26.
పినపాక మండలంలోని సత్యమేవ జయతే ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్, ప్రధాన కార్యదర్శి నిట్టా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంపెల్లి సంతోష్ స్వతంత్ర సమరయోధులకు పూలమాలవేసి నివాళులర్పించారు.ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో దేశభక్తిని చాటుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరపడం గర్వించదగ్గ విషయం అన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది,సామాజిక కార్యకర్త కర్నె రవి పాల్గొని, మాట్లాడుతూ మహనీయులు అందరికీ సమానత్వపు, స్వేచ్ఛ హక్కు కల్పిస్తూ ప్రజల చేత ప్రజాస్వామ్యాన్ని ఏర్పరిచే విధంగా రాజ్యాంగాన్ని రచించి దేశానికి అంకితం ఇచ్చిన స్వతంత్ర సమరయోధులను, రాజ్యాంగ రూపకర్తలను స్మరించుకున్నారు.భారత రాజ్యాంగం వల్ల దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు సీనియర్ జర్నలిస్ట్ గుండు నరసింహ మూర్తి, ట్రెజరర్ కన్నె రమేష్, సంస్కృతిక క్రీడా విభాగం తోకల శెంకర్, అండెం యాకన్న, రియాజ్, దొడ్డ శ్రీనివాస్ ,వింజమూరి సతీష్, గుమాసు వెంకటేశ్వర్లు, కల్తి ప్రభాకర్, జాడి శ్రీనివాస్, మీసేవ నిర్వాహకులు సోంపెల్లి శ్రీను, తోగ్గూడెం బి ఆర్ ఎస్ నాయకులు పుప్పాల నరసింహారావు, బుడగం సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.





