
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 26
మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం మచ్చబొల్లారం డివిజన్ కౌకూర్ లో బీజేవైఎం డివిజన్ అధ్యక్షులు రుద్రరాజ్ నాగరాజు గారి ఆధ్వర్యంలో “గణతంత్ర దినోత్సవ వేడుకల్లో” పాల్గొని త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి, జెండా వందనం చేసిన బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రచార కార్యదర్శి జిల్లెల రవి యాదవ్ గారు

ఈ సందర్భంగా జిల్లెల రవి యాదవ్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషిపలితమే మనకు స్వాతంత్ర్యం వచ్చిందని, స్వాతంత్ర్య భారతం గణతంత్ర దేశంగా ఆవిర్భవించిందని. భిన్న మతాలు, భాషలు, సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయంగా మారిన భారత దేశ ప్రతిష్ఠతను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు…
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కౌశిక్ యాదవ్, అజయ్ రెడ్డి, డివిజన్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఏండ్ల భాస్కర్, నాగరాజు, ఆకారం సాయి రామ్, సునీల్, తరుణ్ నాయుడు, జిల్లెల భారత్ యాదవ్, మణి రత్నం తదితరులు పాల్గొన్నారు





