
మల్కాజ్గిరి జన సముద్రం న్యూస్ ప్రతినిధి జనవరి 25
సేవ్ మంకీస్ ఫీడ్ మంకీస్ అనే నినాదంతో మల్కాజ్గిరి నియోజకవర్గానికి చెందిన మానవసేవే మాధవసేవ వాట్సాప్ గ్రూప్ ద్వారా గత 57 నేలల నుండి నర్సాపూర్ అడవిలో ఉన్న వానరులకు ప్రతినెల ఒక రోజు గ్రూప్ సభ్యుల సహకారంతో ఆహారం అందిస్తున్నారు.కార్యక్రమంలో భాగంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు,గ్రూప్ సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్,ఫణి కుమార్,ఉదారి సత్యనారాయణ యాదవ్, మల్లేష్ యాదవ్, కలగా పార్వతి,మోహన్ రాజ్,ల సహకారంతో బుధవారం మల్కాజిగిరి నుండి నర్సాపూర్ అడవికి వెళ్లి వానరులకు అరటి పండ్లు,ఆహారంగా అందించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు మాట్లాడుతూ నర్సాపూర్ అడవుల్లో వానరులకు ఆహారం అందక పల్లెలు పట్టణాలు వైపు వచ్చి వాటి ప్రాణాలు కల్పోతున్నాయని,అది నివారించడానికి గత 57 నేలల నుండి ఒక యజ్ఞాంల గ్రూప్ సభ్యుల సహకారంతో ప్రతి నెలకు ఒక రోజు నర్సాపూర్ అడవికి వెళ్లి వానరులకు ఆహారం అందిస్తున్నామని అన్నారు. పట్టణాల్లో ఉన్న యువత,స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి వీకెండ్ టు నర్సాపూర్ ఫారెస్ట్ అని నెలకు ఒక రోజు అడవిలో ఉన్న వానరులకు ఆహారం అందిస్తే మూగజీవాలకు మేలు జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రూప్ అడ్మిన్ కుమ్మరి రాజు,ఊదరి సత్యనారాయణ యాదవ్, సుధాకర్ తదితరులు పాల్గొనడం జరిగింది.





