
-పనిచేసే కార్యాలయం ముందు నిరసన ధర్నా
-మేనేజ్మెంట్ మొండి వైఖరి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి.
-ఆర్.లక్ష్మీనారాయణ(ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు) డిమాండ్.
జనసముద్రం న్యూస్: మణుగూరు ప్రతినిధి,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
మణుగూరు ప్రీమియర్ ఎక్స్ క్లూజివ్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ, ఆధ్వర్యంలో ఎక్స్ ప్లో జివ్ కార్మికులు నేటి నుండి నిరవధిక సమ్మెకు కార్యాలయం ముందు దిగారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ కార్మికుల పక్షాన నిలబడి వారికి సంపూర్ణ మద్దతు తెలియజేశారు. మంగళవారం నుండి ఉదయం 7 గంటలకు కార్యాలయం ముందు కార్మికులు నిరవధిక సమ్మెకు దిగడంతో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కార్మికులకు వేతన ఒప్పందం అమలు చేయకుండా మేనేజ్ మెంట్ కాలయాపన చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఏఐ టీయు సీ నాయకత్వాన అనేకసార్లు మేనేజ్ మెంట్ వారు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదని వారి కనీస అవసరాలు కూడా తీర్చడం లేదని నవంబర్ ఒకటవ తేదీన యాజమాన్యానికి కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడం జరిగిందని, వీటితోపాటు అధికారులకు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ మరియు ,లేబర్ కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు వారు వివరించారు. యాజమాన్యం కార్మికులతో 30 సంవత్సరాల నుండి వెట్టి చాకిరి చేపిస్తుందని, సమస్యల గురించి మాట్లాడితే పట్టించుకోవడంలేదని అందుకే కార్మికులు విసుకు చెంది సమ్మెకు దిగాల్సి వచ్చిందని ఇకనైనా యాజమాన్యం దిగివచ్చి కార్మికులతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో ఏఐటియు సి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతాయని వారు హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఐటియుసి మండలఅధ్యక్షలు తోట రమేష్, కార్యదర్శి అక్కి నరసింహారావు , జిల్లా సమితి సభ్యులు ఎస్.కె సర్వర్ , సొందే కుటుంబరావు, మంగి వీరయ్య, కార్మికులు ఎర్రయ్య యాకయ్య ,బుచ్చి రాములు, అశోకు ,బాబురావు నరసింహారావు ,మాధవరావు బాబురావు ,కార్మికులు పాల్గొన్నారు.





