
జనసముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, పినపాక, జనవరి 22.
ఫిబ్రవరి 6న తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టే పాదయాత్రకు లైన్ క్లియర్ అయిందని రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు సహకరించి విజయవంతం చేయాలని పినపాక మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడిశాల రామనాథం పిలుపునిచ్చారు. ఫిబ్రవరి6 న భద్రాచలంలో భారీ బహిరంగ సభ ఉంటుందని, ఈ మహాసభకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాల కు తప్పకుండా యాత్ర చేస్తారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం ఉమ్మడి జిల్లాలో నాయకులంతా ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ గెలవటం ఖాయమన్నారు. పాదయాత్ర, భారీ బహిరంగ సభ భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు.





