
-నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకే జాబ్ మేళ.
-వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా కాంతారావు.
జన సముద్రం న్యూస్ ప్రతినిధి ,డి. శ్రీనివాస్, మణుగూరు, జనవరి 21.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు సమక్షంలో నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్, హైద్రాబాద్ కు చెందిన కలర్ స్కై టెక్నాలజీ హైదరాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో ప్లేస్మెంట్ ట్రైనింగ్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ను నిర్వాహకులతో కలిసి వారి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా తెలంగాణ రేగా కాంతారావు మాట్లాడుతూ నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా అవగాహన సదస్సు నిర్వహించడం జరిగిందన్నారు, ఈనెల 29వ తేదీ నాడు మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అన్నారు.పినపాక నియోజకవర్గం లో అనేకమంది నిరుద్యోగులు ఉన్నారని నిరుద్యోగ సమస్యలు నిర్మూలించడం కోసం ఎంతో కృషి చేస్తున్నామన్నారు.ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం సుధూర ప్రాంతాలకు వెళ్లి అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఆ ఇబ్బందులను దూరం చేసుకునేందుకు ప్రైవేట్ కంపెనీలతో మాట్లాడి నిరుద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నామని తెలిపారు.





