
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం జనసముద్రం ప్రతినిధి శ్యాం జనవరి 19
చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దఫా కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ బీరం హర్షవర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటి పరీక్ష జరిగేలా అధికారులు బాధ్యత తీసుకోవాలని ఆయనఅన్నారు.
ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్రచికిత్సలు,మందులను అవసరం అయినా వాళ్ళకి కళ్ళజోడు ఉచితంగా,అలాగే అవసరం అయినా వారికి ఉచితంగా ఆపరేషన్ కూడా చేస్తారని ఆయన తెలిపారు.
ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజలందరూ కలిసి సద్వినియోగం చేసుకోవాలన్నారు ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు,డాక్టర్లు, వైద్య సిబ్బంది,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





