
జన సముద్రం న్యూస్ ప్రతినిధి, డి .శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 19.
కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ విలేకరుల సమావేశం నిర్వహించటం జరిగింది.ఈ సందర్భంగా మాట్లాడుతూ మాయమాటలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని,
బి.ఆర్.ఎస్ పార్టీ పేరుతో దేశ సమస్యలను చూపుతూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మరోసారి ముఖ్యమంత్రి అవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నారు అని అన్నారు.ఇచ్చిన హామీల నెరవేర్చకుండా సక్రమంగా రాష్ట్రాన్ని పరిపాలన చేయలేని వారు దేశాన్ని ఉద్దరిస్తారంటా అని ఎద్దేవా చేశారు. కెసిఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలైన నిరుద్యోగులకు కేజీ టు పీజీ, ఉచ్చిత విద్య,నిరుద్యోగ భృతి,కాంట్రాక్టు వ్యవస్థ రద్దు,దళితులకు మూడు ఎకరాల భూమి,రైతులకు ఉచిత ఎరువులు,గొల్ల కుర్మలకు గోర్లు,పోడు భూములకు పట్టాలు,నియోజకవర్గానికో ఫూడ్ ప్రాసెసింగ్ యూనిట్,నియోజకవర్గానికో పాలిటేక్నిక్ కళాశాల
ఇలా చేప్పుకుంటు పోతే వందల హామీలను ఇచ్చి నేటికి ఏ ఒక్క హామీ కూడా సరిగా నెరవేర్చిన దాఖలాలు లేవని తెలిపారు.ప్రజలు బిఆర్ఎస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని తెలిపారు.
పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో దేశంలో,ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.





