
జన సముద్రం న్యూస్, మిర్యాలగూడ, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణుజే, జనవరి 17:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 2023 సంవత్సరంలో జనవరి 18న రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం ను ప్రారంభి స్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి చూపు తక్కువ ఉన్న వృద్ధులకు కళ్లద్దాలు పంపిణీ, నేత్ర వైద్యం కొరకు సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. కంటి చూపు తక్కువగా ఉన్న వృద్ధులకు కంటి చూపు కనపడేలా సీఎం కేసీఆర్ “పెద్ద కొడుకు” బాధ్యతలు తీసుకొని ‘కంటి వెలుగు’ కార్యక్రమమును నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023 జనవరి 18న రెండో విడత ‘కంటి వెలుగు’ కార్యక్రమమును ప్రారంభించి, 19 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే రెండో విడత” కంటి వెలుగు” కార్యక్రమం గురించి నల్గొండ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం రోజున మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ సమావేశమును నిర్వహించారు.
అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్డిఓ బి. చెన్నయ్య సంభందిత అధికారుల తోఅత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డీవో బి. చెన్నయ్య మాట్లాడుతూ..
రెవెన్యూ డివిజనల్ లో నిర్వహించే రెండో విడత కంటి పరీక్షలకు సంబంధిత డాక్టర్లు కంటి వెలుగు కార్యక్రమం జరుగు ప్రాంతంలోనే ఉండాలని, కంటి పరీక్షల షెడ్యూల్ ను విధిగా గ్రామపంచాతీలకు అందజేయాలని, రీడింగ్ గ్లాసెస్ ను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆర్డిఓ బి. చెన్నయ్య సూచించారు.
ఈ సమావేశంలో సంభందిత అధికారులు, ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్, తహశీల్దార్లు, యం.పి.ఓ లు, ఏ.పి.వో లు హాజరైనారు.





