
జనసముద్రం న్యూస్ ప్రతినిధి,డి. శ్రీనివాస్, కరకగూడెం, జనవరి 16.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,కరకగూడెం మండలం పరిధిలోని తాటిగూడెం గ్రామంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విభిన్నమైన ముగ్గులు ఎన్నో రకాల రంగులతో అలంకరించడంతో చూపరులను ఆకట్టుకున్నాయి. మండల పరిధిలోని తాటిగూడెం, విప్ప చెట్టు గుంపు నందు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఈ పండుగను మరువలేమని ఆరుగాలం కష్టపడిన రైతు తన పంట చేతికొచ్చిన తరుణంలో జరుపుకునే మొట్టమొదటి పండుగగా అభివర్ణించారు. ఈ ముగ్గుల పోటీని దుర్గం ప్రేమ్ కుమార్, జిమ్మిడి ప్రకాష్, దుర్గం ప్రసాద్, ఆధ్వర్యంలో నిర్వహించి ప్రతిభ చూపిన వారికి సాంప్రదాయ బహుమతులు అందజేశారు. ప్రతి ఇంట గ్రామంలో బంధువులతో ఇంటికొచ్చిన బిడ్డలతో, అల్లులతో సంక్రాంతి పండగ వాతావరణం నెలకొంది. మొదటి బహుమతి జిమ్మీడి యాదగిరి,రెండో బహుమతి శేరి భవాని,
మూడో బహుమతి దుర్గం జ్యోతి గెలుచుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ కొమరం విశ్వనాథం, కరకగూడెం ఏఎస్ఐ పాపయ్య,రావుల సోమయ్య,సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, న్యాయవాది సుందర్ రామ్, రైటర్ దుర్గారావు, స్థానిక ఉప సర్పంచ్ జాడి నాగరాజ్, శెరు శ్రీధర్, జాడి రామనాథం, జాడి దేవేంద్ర వరప్రసాద్, సెక్రెటరీ వీరన్న, మణుగూరు సెక్రెటరీ జిమ్మిడి విజయ్, దుర్గం ప్రవీణ్, శరత్, సందీప్, కిరణ్, జిమ్మిడి ప్రశాంత్, జాడి దినేష్, అర్జున్, దామోదర్, మురళి మహిళలు దుర్గం స్వాతి, మౌనిక రాణి, జాడి దీపిక, సంధ్యారాణి, మనిషా, అపర్ణ, సంజన, ప్రణవి, మంగ వేణి, లోకేశ్వరి, కళ్యాణి, సాంబలక్ష్మి, సరిత,తదితరులు పాల్గొన్నారు.





