జనసముద్రం న్యూస్, తిరుమలగిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గం, మిర్యాలగూడ డివిజన్ ఇంచార్జ్ విష్ణు జె, జనవరి 11:

హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని రుద్ర స్టూడియో రుద్ర శ్రీనివాస్ ఇస్తున్న న్యూ టాలెంట్ 2023 అవార్డు సామాజిక కార్యకర్తలకు, కవులకు, సినీ పరిశ్రమ మూవీ ఆర్టిస్ట్ లకు, సీరియల్ ఆర్టిస్ట్ లు, యాంకర్స్ లకు ఇచ్చే అవార్డుకు మిర్యాలగూడ డివిజన్ పరిధిలోని తిరుమలగిరి, నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని జాల్ తండాకు చెందిన “గిరిజన ప్రజా సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు”, యువ కవి, సామాజిక కార్యకర్త, గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు గ్రహీత జటావత్ మునినాయక్ కు “న్యూ ట్యాలెంట్ అవార్డ్2023” కు ఎన్నిక చేశామని రుద్ర శ్రీనివాస్ తెలిపారు.
రుద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ..
” జటావత్ ముని నాయక్” అనేక రంగాలలో సామాజిక సేవలను అందిస్తూ 2000 లకు పైగా స్టూడెంట్స్ కి సమాచారం అందిస్తూ ఒక మోటివేషన్ స్పీకర్ ల ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ సినిమా రంగంలో ఉన్న ప్రముఖుల సైతం మెచ్చుకునే కార్యక్రమాలు చేయడం అనేది ఎంతో కృషి పట్టుదల ఉంటేనే చేయగలరని శ్రీనివాస్ తెలిపారు. చిన్న వయస్సులో ఇంతటి కార్యక్రమాలు చేయడం చాల ఆనందాన్ని ఇచ్చిందన్నారు, ఈ కార్యక్రమం జనవరి 22, 2023 సం “న హైదరాబాద్ నగరంలోని శ్రీనగర్ లో శ్రీ సత్య సాయి నిలయం లో జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు.
గిన్నిస్ బుక్ అవార్డు గ్రహీత జటావత్ ముని నాయక్ మా ట్లాడుతూ..
న్యూ టాలెంట్ అవార్డుకి ఎన్నికవడం చాల ఆనందాన్నిచ్చిందన్నారు, ఎక్కడో పల్లెలో ఉండే నేను ఈ స్థాయికి రావడం చాల సంతోష నిచ్చిందన్నారు. “ఈ సంతోషానికి కారణం నా కృషి పట్టుదలతో పాటు నన్ను ప్రోత్సహించిన నా తల్లి తండ్రిలు, మిత్రులు, గ్రామ ప్రజలు ఇంకా ఎంతో మంది ప్రోత్సాహం వల్ల నేను ఈ స్థాయికి రాగాలిగానని గుర్తు చేసుకున్నారు”. ఇంతే కాకుండా ఈ అవార్డు సంతోషంతో పాటు మరెన్నో బాధ్యతలను తెచ్చిపెట్టిందన్నారు. మునినాయక్ ను రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు, , గిరిజన బంజారా నాయకులు, స్నేహితులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొని ఇంకా మరెన్నో అవార్డులు సాధించాలని అభినందించారు.






