జనసముద్రం న్యూస్, బిచ్కుంద ప్రతినిధి,జనవరి 11 :

కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని పెద్ద తడుగురు గ్రామం వరకు కొనసాగుతున్న బీటీ రోడ్డు పనులను జుక్కల్ ఎమ్మెల్యే హాన్మంత్ షిండే బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దతడుగురు నుండి మద్నూర్ వరకు బీటి రోడ్డు పనులను చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. అక్కడక్కడ రోడ్డు పనులను నెమ్మదిగా కొనసాగుతున్న వల్ల ఇక్కడ గ్రామ ప్రజలకు అనేక ఇబ్బందులు ఉండడంతో ఎమ్మెల్యే హాన్మంత్ షిండే కాంట్రాక్ట్ కు పనులను త్వరగా పూర్తిచే యాలని ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు భారతీయ రాష్ట్ర సమితి పార్టీ మండల అధ్యక్షులు సంగమేశ్వర్ శీను పటేల్ రామ్ పటేల్ చిన్నశక్కర్గ సర్పంచ్ గఫార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.





