జన సముద్రం న్యూస్, కోహెడ,కోహెడ ప్రసాదరావు, జనవరి 10 :

సమాజంలో జ్యోతి శాస్త్రం పట్ల ప్రజలకు విశ్వసనీయత అధికమవుతున్నందున సామాన్యుల చెంతకు జ్యోతిష్య గ్రంథాలు చేరువ కావాల్సి ఉందని ప్రముఖ సిద్ధాంతి శ్రీ శ్రీ దివ్యజ్ఞాన గురూజీ అన్నారు. హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో బహు జ్యోతిష్యాస్త్ర గ్రంథకర్త డాక్టర్ మహేష్ చందర్ భరద్వాజ్ రచించిన జ్యోతిర్నేత్రం అనే గ్రంధాన్ని ఆవిష్కరించడం పట్ల మంగళ వారం పలువురు పండితులు ఆయన అభినందించారు. జ్యోతిష శాస్త్రంలో అనేక పరిశోధనలు గావిస్తూ నూతనంగా రచించిన జ్యోతిర్నేత్రం గ్రంథ ఆవిష్కరణ సభ సమావేశం శనివారం రోజున సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అనేకమంది జ్యోతిష్య శాస్త్ర పండితుల మధ్య ఆవిష్కృతమైంది. జ్యోతి శాస్త్ర పండితులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి వెరివెంటి ఫణి శశాంక శర్మ మర్మాముల వెంకటరమణ శర్మ డాక్టర్ అవసరాల ప్రసాద శర్మ వెన్నంపల్లి జగన్మోహన శర్మ గాదె సోమ నాధ శర్మ గాడి చర్ల జ్ఞానేశ్వర్రావు శాస్త్రుల కృష్ణమూర్తి ఓరుగంటి రామారావును పాల్గొనగా పోచన పెద్ది కృష్ణమూర్తి విఖ్యాత గా వ్యవహరించగా రేవతి, శ్రీదేవి ల సంగీత గానకచేరి అలరించినది ఇంకా ఈ సమావేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు పండితులు పాల్గొన్నారు.





