జనసముద్రం న్యూస్,శ్రీ సత్యసాయి జిల్లా,జిల్లా ఇంచార్జ్ సోమశేఖర్,జనవరి,09:

అమడగూరు న్యూస్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలు దేశానికే ఆదర్శమని వైసిపి మండల కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి (సూరి) కొనియాడారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర పూర్తయి నాలుగు సంవత్సరాలు అయిన సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ప్రాంతంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు.అనంతరం కేకు కట్ చేసి పంచిపెట్టారు.ఈ సందర్భంగా వైసిపి నాయకులు మాట్లాడుతూ…జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుండి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకొని,సమస్యలను తీరుస్తానని హామీ ఇచ్చాడన్నారు.అధికారంలోకి రాగానే నవరత్నాల పథకాలతో ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందేందుకు కృషిచేసాడన్నారు.సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేసి ప్రజల వద్దకు అధికారాన్ని తెచ్చారన్నారు.నాడు-నేడు పథకాలతో పాఠశాలల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు.నవరత్నాల పథకాల వల్ల అన్నివర్గాల ప్రజలకు మేలు చేకూరిందన్నారు.ముఖ్య
మంత్రి ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శనీయమని తెలిపారు.అనంతరం పార్టీ క్యాలెండర్ ఆవిష్కరణ గావించారు.ఈ కార్యక్రమంలో సహకార బ్యాంకు అధ్యక్షులు బొమ్మిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి,సర్పంచులు షబ్బీర్,శ్రీధర్ రెడ్డి,సురేందర్ రెడ్డి,సచివాలయ కన్వీనర్లు దొడ్డప్ప,లోకేష్ రెడ్డి,టౌన్ కన్వీనర్ సుధాకర్ రాజు,డీలర్ల సంఘం అధ్యక్షులు కొండారెడ్డి,ఆదినారాయణ,అమర్నాథ్ రెడ్డి,ఉప సర్పంచ్ నవీన్,ఫకీర్ రెడ్డి,శివరాం,రోశయ్య,వాలంటీర్లు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.





