జనసముద్రం న్యూస్, పుల్లల చెరువు,జనవరి 9:

మార్కాపురం విద్యుత్ ఈ.ఈ ఆధ్వర్యంలో మండలంలో విజిలెన్స్ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.మండలంలో పలు గ్రామాలలో 1735 సర్వీసులను తనిఖీ చేయగా అదనపు లోడు వాడుతున్న 26 సర్వీసులను గుర్తించి,అక్రమంగా విద్యుత్ ఉపయోగించిన వారికి అపరాధ రుసుము 62,400,నేరుగా విద్యుత్ లైన్లనుంది అక్రమంగా వాడిన 46 మందికి అపరాధ రుసుము 85,000,అలాగే మీటర్నుండి అక్రమంగా లూపింగ్ ద్వారా వాడుతున్న సర్వీసులు 8 ఉండగా వీరికి 43,000 జరిమానా విధించారు.ఈ తనిఖీ లో మొత్తం 80 మంది పట్టుబడగా 1,47,000 లను జరిమానా విధించినట్లు అధికారులు తెలిపారు.త్వరలో వీరందరికి నోటీసులు అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఈ.ఈ.పివి.నాగేశ్వరరావు,ఈ.ఈ.విజిలెన్స్ హైమవతి,ఎడియి విజిలెన్స్ శ్రీనివాసరావు,ఎయి విజిలెన్స్ కోటేశ్వరరావు,ఎర్రగొండపాలెం ఏ.డీఈరాఘవేంద్రరావు,మార్కాపురం ఏది.ఈ.సియానాయక్,ఎయి చంద్రశేఖర్,డివిజన్ లోని ఎయిలు,సిబ్బంది పాల్గొన్నారు.





