యుగాంతం మొదలైందంటూ శాస్త్రవేత్తల హెచ్చరిక

Spread the love
జనసముద్రం న్యూస్,జనవరి 03:

కంటికి కనిపించని సూక్ష్మజీవి(వైరస్) మనిషి మనుగడను శాసిస్తోంది. చైనాలోని వ్యూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని రెండేళ్లపాటు గడగడలాడించింది. అయితే గతంలోనూ కొన్ని రకాల సూక్ష్మజీవులు పెద్ద సంఖ్యలో జీవరాశులను కబళించిన ఘటనలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే అనేక పుకార్లు షికార్లు చేస్తున్నారు.

చైనాలో మళ్లీ వెలుగు చూస్తున్న కరోనా కేసులు ప్రపంచాన్ని మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. జీరో కోవిడ్ విధానానికి చైనా స్వస్తి పలకడంతో ఆ దేశంలో రోజుకు కోట్లల్లో పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా రోగులకు కనీసం బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఈ భయాందోళన మధ్యే సైంటిస్టులు సైతం యుగాంతంపై హెచ్చరికలు జారీ చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
భూమిపై ఉన్న జీవరాశి ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి దాదాపు 90 శాతం అంతరించిపోతుంది. తిరిగి మళ్లీ కొత్తగా జీవరాశి పుట్టుకొట్టుంది. దీనినే సామూహిక నాశనమంటారని సైంటిస్టులు పేర్కొంటున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే ఐదు సార్లు జరిగిందని ఇప్పుడు మనం ఇప్పుడు జరగబోయేది ఆరోదని చెబుతున్నారు.
ప్రస్తుతం మనం ఆరో యుగాంతం మధ్యలో ఉన్నామని సైంటిస్టులు చెబుతుండటం గమనార్హం. ఈసారి రాబోతున్న యుగాంతానికి మనిషి స్వయంకృతాపరధమే కారణమని చెబుతున్నారు. భూమిపై మనుషుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి ఇతర జీవులకు నీడ కూడా లేకుండా పోతుందని వివరించారు.
ఆరున్నర కోట్ల ఏళ్ళ కిందట నాడు బత్రికి ఉన్న రాక్షస బల్లులు.. డైనోసార్లు సహా పలు జీవులన్నీ పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాయి. కొన్ని జంతు జాతులు పూర్తిగా అంతరించిపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కూడా మళ్లీ ఆ స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
గత 50 ఏళ్లలో భూమిపై ఉన్న జీవుల్లో 69 శాతం కనుమరుగయ్యాయని వరల్డ్ వైల్డ్లైఫ్ ఫండ్ పేర్కొంది. జనాభా పెరుగుతున్న కొద్దీ అడవులు.. చెరువులు.. గుట్టలు.. నదులు అన్నీ మాయమవుతున్నాయి. జీవులకు నిలువ నీడ లేకుండా పోతుందని అందుకే తరచూ వన్యమృగాలు ఇళ్లల్లోకి వస్తున్నాయి. ఈ ప్రాణులన్నీ బతుకాలంటే ఈ భూమి సరిపోదు.
20 ఏళ్ల కిందట వరకు కూడా ఇంటి చుట్టూరా పక్షుల కిలకిలలు.. కోయిల కుహు.. కుహులు వినిపించేవి. ఇప్పుడు మచ్చుకు కూడా అలాంటి ఘటనలు కన్పించడం లేదు. అడవులు.. పక్షులు.. జంతువులన్నీ కనుమరుగు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలనూ ఇదే పరిస్థితి నెలకొంది.
అమెజాన్ నది లోయలోని దక్షిణ అమెరికాలోనూ ఇదే పరిస్థితి. 1970 నుంచి ఇప్పటి వరకు అక్కడ 94 శాతం జీవులు మాయమయ్యాయని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామూహిక ప్రాణి హననం జరగడమే యుగాంతమని.. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఇదేనంటూ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం