పవన్ మాట విని నిరాహార దీక్ష విరమించిన హరిరామ జోగయ్య

Spread the love

జనసముద్రం న్యూస్, జనవరి 02:

కాపులకు రిజర్వేషన్ కల్పించాలనే ప్రధాన డిమాండ్తో 82 ఏళ్ల వయసులో ఆమరణ నిరాహారత దీక్షకు దిగిన కాపు నాయకుడు మాజీ మంత్రి చేగొండి హరిరామయ్య జోగయ్య వ్యవహారం.. రెండుతెలుగు రాష్ట్రాల్లోనూ టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. 82 ఏళ్ల వయసులో ఆయన దీక్షకు దిగడం.. అందరినీ విస్మయానికి ఉత్కంఠకు కూడా గురి చేసింది. ఈ క్రమంలో అలెర్టయిన పోలీసులు ఆయనను వెంటనే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే.

అయితే.. అక్కడ కూడా ఆయన దీక్ష చేశారు. అయితే.. ఆయన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. దీక్ష విరమించాలని.. వైద్యులు సూచించారు అయినా.. జోగయ్య వినలేదు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. దీక్ష విరమించాలని జోగయ్యకు విన్నవించారు. దీంతో పవన్ సూచన మేరకు  పెద్దాయన దీక్ష విరమిస్తున్నానని ప్రకటించారు.  
దీనికి ముందు జోగయ్యతో ఫోన్లో మాట్లాడిన పవన్.. ఇది మూర్ఖపు మొండి ప్రభుత్వం… కాపులకు రిజర్వేషన్లను వేరే విధంగా సాధించుకుందామని జోగయ్యకు చెప్పాన. జోగయ్య లాంటి వ్యక్తుల సలహాలు.. అనుభవం అవసరం“ అని అన్నారు.  ఈ క్రమంలో దీక్ష విరమించాలని జోగయ్యకు పవన్ విజ్ఞప్తి చేశారు.  అన్ని రకాలుగా ఆలోచించి కార్యాచరణ రూపొందిద్దామని జోగయ్యకు పవన్ సూచించారు. మందులు కూడా వేసుకోకుండా నిరాహార దీక్షకు దిగడం బాధ కలిగిస్తోందన్నారు.
ఒక్కసారిగా ఇంతటి సాహసం చేస్తే ఎలా అంటూ జోగయ్యకు పవన్ బుజ్జగించినట్టు తెలిసింది. ఇదిలావుంటే జోగయ్య ఆసుపత్రి బెడ్పై నుంచే మాట్లాడుతూ.. “పవన్ సీఎం కావాలి.. పవన్ ద్వారా రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే తన కోరిక“ అని అన్నారు. పవన్  వచ్చి తనను కలుస్తానని  హామీ ఇచ్చినట్టు జోగయ్య  చెప్పారు.  జోగయ్య మార్గ దర్శకత్వం వహించాలని కూడా పవన్ చెప్పినట్టు తెలిపారు. సీఎం జగన్ దిగి రావాలన్నదే తన ఆ ఆలోచనన్న జోగయ్య… పవన్ సూచనకు సానుకూలంగా దీక్ష విరమించినట్టు తెలిపారు.  ఈ పరిణామాలతో రాబోయే రోజుల్లో వైసీపీకి కాపుల వేడి మరింత తగులుతుందని అంటున్నారు పరిశీలకులు.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం