భారత్ పై అణు యుద్ధం చేస్తానన్న పాకిస్థాన్..ఇప్పుడు అడుక్కుతింటోంది

Spread the love
జనసముద్రం న్యూస్, డిసెంబర్ 28:

ఇంకేముంది.. భారత్పై అణుయుద్ధమే చేస్తాం.. అంటూ కోతలు కోసిన దాయాది దేశం పాకిస్థాన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?  మాటలు కోటలు దాటించిన పాకిస్థాన్ నాయకులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా? అంటే.. అడుక్కతింటున్నారని అంటున్నారు అంతర్జాతీయ పరిశీలకులు. దీనికి కారణం.. పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడమే!

అంతేకాదు… పూటగడవని స్థితిలో ఉన్నాం.. తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సంస్థలతోపాటు వివిధ దేశాలను పాక్ ప్రభువులు వేడుకుంటున్నారు. ప్రభుత్వాన్ని నడపలేక ఉద్యోగుల జీతాల్లోనూ కోత విధించడం వంటి చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో అమెరికాలోని పాకిస్థాన్ రాయబార కార్యాలయంలో ఉన్న ఆస్తులను అమ్మేందుకు పాకిస్థాన్ సిద్ధమైంది.
వాషింగ్టన్లో ఉన్న వీటిని కొనుగోలు చేసేందుకు మూడు సంస్థలు ముందుకొచ్చినట్లు పాక్ మీడియా వెల్లడించింది. జువిష్కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ 6.8 మిలియన్ డాలర్లతో అత్యధికంగా బిడ్ను వేసినట్లు తెలిపింది. ఇందులో రెండో స్థానంలో భారత్కు చెందిన రియాల్టీ సంస్థ నిలిచింది. 5మిలియన్ డాలర్లతో భారత్ సంస్థ బిడ్ వేయగా.. పాకిస్థాన్కు చెందిన మరో రియాల్టీ సంస్థ 4మిలియన్ డాలర్లను కోట్ చేసింది.
పాకిస్థాన్కు వాషింగ్టన్లోని రెండు ప్రాంతాల్లో రాయబార కార్యాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి పాతది కాగా మరొకటి కొత్తది. వాషింగ్టన్ నగరంలోని ప్రధాన కేంద్రమైన ఆర్ స్ట్రీట్లో ఉన్న భవనాన్ని 1953-56లో అప్పటి పాకిస్థాన్ రాయబారి సయ్యద్ అంజద్ అలీ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2000 వరకు అందులో కార్యకలాపాలు కొనసాగాయి. ప్రస్తుతం కొత్త భవనంలో పాక్ ఎంబసీ కొనసాగుతోంది.

  • Related Posts

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    Spread the love

    Spread the love జన సముద్రం న్యూస్ చింతలపూడి ప్రతినిధి జులై 26 చింతలపూడి మండలం కామవరపుకోట కె.ఎస్.రామవరం గ్రామము లో చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ అధికారులు మరియు వారి సిబ్బంది ఎక్సైజ్ నేరములు కొరకు దాడులు నిర్వహించగా కాగిత నాగరాజు…

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    Spread the love

    Spread the love దర్జాగా కొనసాగుతున్న అక్రమ గృహ నిర్మాణం ఇంటి గుమ్మానికే పరిమితమైన అధికారుల హెచ్చరిక పంచాయతీ అధికారులు నోటీసులు జారీ చేసిన లెక్క చేయని కబ్జాదారులు అన్నమయ్య జిల్లా ఇన్చార్జి న్యూస్ జూలై 26 జనసముద్రం న్యూస్ అన్నమయ్య…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    ఏలూరు . ఏ.ఆవులయ్య ఆదేశాలు చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    అధికారుల ఆదేశాలు బేఖాతార్..!

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    సేంద్రియ జీవన ఎరువులను వాడండి. జిల్లా వనరుల కేంద్రం నరసరావుపేట.

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    మీ ఇంట్లో మీ పిల్లలకు ఇలాంటి భోజనం పెడతారా?

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    రాష్ట్ర అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న కూటమి ప్రభుత్వ నేతలు : రాష్ట్ర రోడ్లు, రవాణాశాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం

    మదనపల్లె టమోటా మార్కెట్ యార్డులో లారీ కిందపడి యూపీ వాసి దుర్మరణం