ధరణిలో మొసాలు : నష్టపోతున్న పట్టా దారులు..ముడుపుల మత్తులో.. రెవెన్యూ శాఖ

Spread the love

జనసముద్రం న్యూస్,డిసెంబర్ 14 :

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల జరుగుతున్న మోసాలకు అంతులేకుండా పోతున్నాయి. ముడుపుల ముడితే చాలు ఎలాంటి దళారి పనులకైన, వెనుకాడని రెవెన్యూ అధికారులతో అసలు పట్టాదారులు నష్టపోతున్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని మేజర్ గ్రామపంచాయతీ బస్వాపూర్ లో గడిచిన 30 సంవత్సరాల క్రితం గ్రామానికి చెందిన తాడెం.కనకయ్య తండ్రి చంద్రయ్య తనకున్న వ్యవసాయ భూమి రెండు ఎకరాల, ఇరువై ఆరు గుంటలను (2.26) అమ్ముకొని, మరొక ప్రాంతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నర్మెట కు వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. తాను అమ్మిన భూములన్నీ అప్పుడున్న భూ పోర్టల్ సర్వే ప్రకారం అతని పెరు పై నమోదై ఉన్నాయి. అయితే ఆ భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తుల వద్ద సరైన విక్రయ పత్రాలు (సర్వే నంబర్లు) లేకపోవడంతో, ఇప్పుడొచ్చిన ధరణిలో కొనుగోలు చేసిన వ్యక్తులకు భూమి పట్టా కాలేదు. ప్రస్తుత ధరణి పోర్టల్ “996/13, 1130/9/1, 1130/9/2, 1330/ఆ/f, 1351అ/2, 1357/1/7, 1391/2″ సర్వే నంబర్లలో ఉన్న (2.19) భూమిని గ్రామానికి చెందిన దళారులు గుర్తించి, భూమి అమ్మిన వ్యక్తితో మంతనాలు జరిపి, రెవెన్యూ అధికారుల అండదండాలతో గుట్టు చప్పుడు కాకుండా దళారులు వారి పక్షాన సోమవారం భూములను పట్టా చేయించుకున్నారు. ఈ విషయాన్ని గ్రహించిన ప్రస్తుత పట్టాదారులు ఆ భూమిని వేరొకరి పేరు మీద పట్టా చేయొద్దని, గత కొద్ది సంవత్సరాలుగా మేమే కాస్తులో ఉంటున్నామని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. సదరు భూమిని యదేచ్ఛగా రెవెన్యూ అధికారులు వేరొకరికి పట్టా చేసి, సెలవు తీసుకోవడం కోస మెరుపు, దీంతో అసలు పట్టాదారులు లబోదిబోమంటున్నారు. తమ భూములు దురాక్రమనకు గురవుతున్నాయని, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై అంశంపై కోహెడ రెవెన్యూ అధికారులను “జనసముద్రం న్యూస్ వివరణ కోరగా పొంతన లేని సమాధానాలు వెలువడుతున్నాయి. ఇక దీనిపై పై అధికారులు ఎలా స్పందిస్తారో… వేచి చూడాలి.

Related Posts

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

Spread the love

Spread the loveభారత స్వాతంత్రోద్యమ కాలంలో, ముఖ్యంగా 1900 ప్రాంతంలో నిజాం రాజ్యంలో జరిగిన తిరుగుబాట్లు మరియు విప్లవాత్మక ఉద్యమాలు ఒక సమాంతర చరిత్ర. నిరంకుశ నిజాం పాలన, పెత్తందారీ వ్యవస్థలపై తిరగబడిన ఈ సమాంతర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన మహానీయుడు,…

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

Spread the love

Spread the loveజనసముద్రం రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8 ఫిబ్రవరి5, 2026 దండకారణ్యంలోని గడిచిరోలి (మహారాష్ట్ర) జిల్లా అడవి ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో డీకే రాష్ట్ర కమిటీ మెంబర్, వెస్ట్ సబ్ జోన్ బ్యూరో ఇంచార్జ్ అయిన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

తెలంగాణ రాబిన్‌హుడ్‌ పండుగ సాయన్న జయంతి ( ఆగస్టు 8) నేడు

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

లోకేటి చందర్ (ప్రభాకర్) జీవిత చరిత్ర

భర్త లేని లోకంలో ఉండలేను

భర్త లేని లోకంలో ఉండలేను

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ర్యాగింగ్ కలకలం

బ్రేకులు ఫెయిల్ అవడంతో అర్ధరాత్రి టిప్పర్ లారీ బీభత్సం

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి

ప్రపంచ షూటింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి